సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని కుటాగుల రైల్వే గేట్ వద్ద ఉన్న మైనారిటీ బాలుర హాస్టల్ నందు 150 మంది గిరిజన విద్యార్థులకు కంటి వైరస్ సోకింది. ఈ హాస్టల్ నందు మూడో తరగతి నుండి పదో తరగతి వరకు గిరిజన విద్యార్థులు ఉండగా అందులో ఎక్కువ శాతం వైరస్ చిన్నారులకు రావడంతో వారందరికీ ఒకే రూములో గడి పెట్టి హాస్టల్ సిబ్బంది బంధించారు. మిగతా విద్యార్థులకు వైరస్ సోకకూడదని రూములో పెట్టడం జరిగిందని హాస్టల్ ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ సత్యసాయి జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ మురళి శ్రీనివాస్ హాస్టల్ పరిశీలించారు. హాస్టల్ ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ సిబ్బందిపై ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా ప్రిన్సిపాల్ మురళి శ్రీనివాస్ మండిపడ్డారు.
సత్యం న్యూస్.నెట్, సత్యసాయి జిల్లా