వనపర్తి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజేంద్ర సింగ్, (ఐ.ఆర్.ఎస్.) శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం చేరుకోగా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక, ప్రొఫైల్ ను పరిశీలించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వనపర్తి నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన వ్యయ కమిటీ ను పరిశీలించి ఇప్పటి వరకు సీజ్ చేసిన వివరాలు, ప్రకటనలకు సంబంధించిన అంశాలు పరిశీలించారు.
జిల్లా ఎస్పి, ఇతర పోలీస్ అధికారులు వ్యయ పరిశీలకుల వెంట ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్