38.2 C
Hyderabad
April 29, 2024 21: 37 PM
Slider గుంటూరు

పేరేచర్ల లో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

#FakeCurrency

నోట్ల రద్దు అయిన తర్వాత చలామణి అవుతున్న నకిలీ నోట్లను మారుస్తూ చలామణి అవుతున్న వ్యక్తుల్ని చాకచక్యంగా అరెస్టు చేసిన  సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల ఎల్  ఏన్ ఎస్ కాలనీలో 4వ లైను లో జరిగింది.

మేడికొండూరు సీఐ ఆనందరావు అందించిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు పేరేచర్ల లో నకిలీ నోట్లను  ముద్రిస్తున్నట్టు సమాచారం అందడంతో ఆయన సోమవారం మధ్యాహ్నం తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేయగా అహ్మద్ అనే వ్యక్తి పేరేచర్ల లక్ష్మీ నరసింహ కాలనీ నాలుగో లైను లో తన స్నేహితుడైన విజయవాడ చెందిన షేక్ కరీముల్లా సాయంతో నకిలీ నోట్లు ప్రింటు చేస్తూ వాటిని నరసరావుపేట, చిలకలూరిపేట, పేరేచర్ల, తెనాలి లలో నోట్లోని మారుస్తూ సుమారు మూడు నెలల నుంచి ఒక లక్షా 50 వేల వరకు ప్రింట్ చేసినట్టు వాటిల్లో 96 వేలు సర్క్యులేషన్ చేసినట్టు తెలిపారు.

అలాగే వీరి వద్ద నుంచి 54  నకిలీ నోట్లను 13 వేల రూపాయలను సీజ్ చేయడం జరిగిందని వారు ముద్రిస్తున్న  ప్రింటర్ను స్వాధీనం చేసుకొని వీరిరువురి అరెస్టు చేసి రిమాండ్  కు పంపడం జరిగింది అని మేడికొండూరు సీఐ ఆనందరావు తెలిపారు.

Related posts

కరోనా పీడితులకు ఆహారం అందిస్తున్న మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS

సొంత జిల్లా కడపలో జగన్ రెడ్డికి ఎదురు గాలి

Satyam NEWS

తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు అదృశ్యం

Bhavani

Leave a Comment