కరోనా పాజిటీవ్ వచ్చిన వారికి ఎనలేని సేవ చేస్తున్నది మై వేములవాడ వాట్సాప్ గ్రూపు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు శనివారం నాడు మూడవ రోజు వరుసగా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమకూర్చారు.
వేములవాడ లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లో ఉన్న కరోనా ఐసోలేషన్ సెంటర్లో కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి వీటిని సమకూర్చారు.
అలాగే రాత్రికి కూడా భోజనం సమకూర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతేకాకుండా లాక్డౌన్ పూర్తి అయ్యేవరకూ ప్రతీరోజు అల్పాహారం, భోజనం అందించనున్నట్లు గ్రూపు సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరి శంకర్, మధు మహేష్, ,దూలం సంపత్ , నూగురి మహేష్ , రంగుల శ్రీనివాస్, పంబి కృష్ణ, మామిడిపెల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.