30.7 C
Hyderabad
April 29, 2024 06: 50 AM
Slider కరీంనగర్

డిష్ట్ర బ్డ్ : కౌన్సెలర్ పదవికి ప్రతాప హిమబిందు రాజీనామా?

vemulawada muncipal prathapa himabindu resigns

వేములవాడ మున్సిపల్ ఎన్నికలలో 28 వార్డ్ కౌన్సెలర్ గా గెలిచినా ప్రతాప హిమబిందు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ భార్య ప్రతాప హిమబిందు బీజేపీ పార్టీ నుండి విజయం సాధించింది.ఆమె గత పాలక వర్గం లో కూడా కౌన్సెలర్ గా ఉన్నారు.కాగా ఇటీవల జరిగిన ఎన్నికలల్లో జరుగుతున్నా పరిణామాలతో ఆమె కలత చెందినట్లుగా తెలుస్తుంది.

ముఖ్యం గా ఆమె భర్త రామ కృష్ణ 23 వార్డునుండి ఓడిపోవడం ఆమెను బాధించింది.పోటీ చేసిన తమ ఇద్దరిపై తెరాస హేమాహేమీలైన నాయకులతో పాటు తమ వర్గం వారు ముఖ్యం గా బంధువులు కక్ష కట్టి తమను ఇబ్బంది పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.ముఖ్యంగా తానూ తన భర్త ఏంతోమందికి సాయం చేయడం తో పాటు,పట్టణాభివృద్ధికి కృషి చేసినప్పటికీ తమను ఓడగొట్టేందుకు తీవ్రం గా యత్నించారని బాధలో ఆమె ఉంది.

గత ఎన్నికల్లో భార్య భర్తలిద్దరూ కౌన్సిలర్లు గా గెలువగా కలిసి సమావేశాలకు హాజరయ్యేవారు.భర్త చాటు భార్యా గా ఉన్న ఆమె ఈ సారి ఒంటరిగా సమావేశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తుందని సమాచారం. ఆమె ఈరోజు జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు కుడా హాజరు కాలేదని తెలుస్తుంది.తొందరపడి రాజీనామా చెయ్యవద్దని వారి అభిమానులు స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు కోరుతున్నారు.

Related posts

పోలీస్ఎటాక్:రైతులు మహిళలపై పోలీసులుదాడి

Satyam NEWS

ఫైనల్: కొల్లాపూర్ లో సత్యం న్యూస్ ప్రిడిక్షన్ కరెక్ట్

Satyam NEWS

మురుగు నీటిలో మునిగిపోతున్న ధర్మపురి కాలనీ

Satyam NEWS

Leave a Comment