39.2 C
Hyderabad
April 30, 2024 19: 40 PM
Slider హైదరాబాద్

కాంట్రాక్టర్ల పై తప్పుడు వార్తలు, ప్రచారాలు మానుకోవాలి

#ghmc

సివిల్ కాంట్రాక్టర్లపై పత్రికల్లో అసత్య ప్రచారాలు మానుకోవాలని మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు. గత వారం రోజుల నుండి ఓ పత్రికలో తమపై అసత్య వార్తలు ప్రచురిస్తున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. రవీంద్ర సాగర్ సాటి కాంట్రాక్టర్లపై పత్రికల ద్వారా  అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేశారు.

అసోసియేషన్ సభ్యులను సంప్రదించకుండా పత్రిక వారికి తప్పుడు సమాచారం ఇచ్చిన ఆయన పత్రికలో వార్తలు రాయిస్తున్నాడని వారు ఒక ప్రకటనలో ఆరోపించారు. వేరే వారి టెండర్లు కూడా తనకే కావాలని అధ్యక్షుడు రవీంద్ర సాగర్ జిహెచ్ఎంసి అధికారులను బెదిరిస్తున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని వారు అన్నారు. తమకు వచ్చిన టెండర్లును రద్దు చేయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తాము చేస్తున్న పనులు వద్దకు వచ్చి జరుగుతున్న పనుల ఫోటోలను తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి అధికారులను బెదిరించి బిల్లులను రాయించుకున్నాడని వారు ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో డి. రాజు, ఎస్. అషన్, సి . మహేందర్ రెడ్డి, కె. వెంకటేష్, డి. తిమ్మరాజు, ఎం. నరసింహ, వరి కొప్పుల రాజు,.  టీ. నాగయ్య , ఎస్. భాస్కర్ రావు, ఏ శివరాం పి.రాములు కె రవీందర్ ఆర్ కె. వెంకట్ రెడ్డి ,రామ్ రెడ్డి,  ఎస్. వెంకటయ్య, బొంత శ్రీను, జి. భాస్కర్ రెడ్డి , ఎస్. రాజేష్ కుమార్ తదితర కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి కమిటీలకు జెడ్పీటీసీ లు ఇక శాశ్వత సభ్యులు

Satyam NEWS

T20 World Cup : సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

Satyam NEWS

జగన్ గారూ మొహమాటం వద్దు ఆర్ టీ జీ ఎస్ వినియోగించుకోండి

Satyam NEWS

Leave a Comment