బీఆర్ఎస్పై ఏఐసీసీ ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలను, రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తోందన్నారు. అమెరికాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ప్రజల కోసం కేసీఆర్ పని చేయడం లేదన్నారు. తన కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.