38.2 C
Hyderabad
April 29, 2024 19: 11 PM
Slider కడప

వైసీపీ హయాంలో మైనారిటీలకు వంచన…

#Council Mohammad Sharif

అన్నమయ్య జిల్లా రాజంపేట లో ముస్లింల కోసం 10 కోట్ల విలువగల 5 ఎకరాల ఈద్గా మైదానం మంజూరు చేసిన ఘనత 2017 లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనని ఎపి శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ వెల్లడించారు.అన్నమయ్య జిల్లా రాజంపేట లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మసీదులు,ఈద్గా, కబరాస్తాన్ల పరిరక్షణ ప్రహరీ గోడల నిర్మాణం,రంజాన్ తోపా ల పంపిణీ జరిగిందని తెలిపారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణం, హైదరాబాద్ నాంపల్లి లో 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం జరిగిందని తెలిపారు.

విజయవాడలో హజ్ హౌస్ కోసం 30 కోట్లు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే,ఈ రోజు వైసీపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకొని నవరత్నాల కు కేటాయించి మైనారిటీ లకు ద్రోహం చేసిందని ఆరోపించారు. ఈ వైసీపీ ప్రభుత్వం లో టీడీపీ హయాంలో మైనారిటీలకు కేటాయించిన 16 పథకాలను రద్దు చేసిందని,70 కి పైగా దాడులు,మరణాలకు కారణం అయ్యిందని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి టీడీపీ వస్తేనే మైనారిటీ లకు మంచి రోజులు వస్తాయని అన్నారు.

ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు,మైనారిటీ నేత బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

యోగాను విశ్వజనీనం చేసిన ప్రధాని నరేంద్రమోడీ

Satyam NEWS

అడ్డగోలుగా విద్యుత్ చార్జీల వసూలు అన్యాయం

Satyam NEWS

సీపీఎం కార్యాలయం లో చొరబడి నేతలను అరెస్టులు చేసిన ఖాకీలు..!

Satyam NEWS

Leave a Comment