39.2 C
Hyderabad
May 3, 2024 14: 19 PM
Slider ప్రత్యేకం

రోజు రోజుకూ ఉధృతమవుతున్న రైతుల ధర్నాలు

amaravathi 26

అమరావతి రైతుల పోరాటం 9వ రోజుకు చేరింది. ఈ రోజు తుళ్ళూరులో ధర్నా దీక్షలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నది. కులాలు, మతాలకు అతీతంగా తుళ్ళూరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించేందుకు రైతులు సిద్ధమౌతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు, డాక్టర్ల సంఘాలు, అమరావతి పరిరక్షణ సమితి, గుంటూరు జిల్లా ప్రజానీకం రైతులకు మద్దతు తెలుపుతున్నారు.

ఈ రోజు టీడీపీ కార్యదర్శి లోకేష్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. వామపక్షాలైన సీపీఐ సీపీఎం పార్టీలు ఇప్పటికే రాజధాని పోరాటంలో పాలుపంచుకుంటున్నాయి. తుళ్ళూరులో ధర్నా దీక్షకి  పెద్ద ఎత్తున రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు క్యాబినెట్ భేటి దృష్ట్యా రాజధాని కార్యాచరణ పై చర్చించనున్నారు.

Related posts

జగన్ ప్రభుత్వాన్ని ఢీ కొట్టడమే జనసేన లక్ష్యం…!

Bhavani

హిందూపురం జిల్లా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

దీపావళికి బద్రీనాథ్ వెళుతున్న ప్రధాని మోదీ

Satyam NEWS

Leave a Comment