37.7 C
Hyderabad
May 4, 2024 14: 02 PM
Slider కృష్ణ

జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి

#kodikattisreenu

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనందుకు నిరసనగా కోడి గురువారం నుండి నిరాహర దీక్ష చేస్తున్నట్లు కోడి కత్తి శ్రీను తెలిపారు. బుధవారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోడి కత్తి శ్రీను తల్లి  మాట్లాడుతూ తన బిడ్డను ఐదు సంవత్సరాలై ఇంత వరకు విడుదల చేయలేదని బోరున విలపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సార్లు విన్న వించుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు. అనంతరం కోడి కత్తి శ్రీను సోదరుడు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా తమ తమ్ముడు జైల్లోనే ఉంటున్నాడని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పె తీరిక ముఖ్యమంత్రికి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సిట్ విచారణ,ఎన్ఐఎ విచారణ జరిపారని అన్నారు.దళితులమైన తమ పట్ల చిన్న చూపు చూస్తూన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపు ఉదయం కనకదుర్గమ్మ సన్నిధిలో కొబ్బరి కాయ కొట్టి  అమరణ నిరహదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.ఎన్ఐఎ కూడ కుట్రకోణం ఏమి లేదని తెల్చిచెప్పిందన్నారు. ఈ అమరణ నిరాహారదీక్ష  జైల్లో శ్రీను,విజయవాడలో తమ తల్లి కలసి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడికత్తి శ్రీను లాయర్ సలిం తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Satyam NEWS

LRS కట్ట వద్దని TPCC జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా పిలుపు

Satyam NEWS

ఈ పోరాటం ఇంతటితో ఆగదు: బాలకృష్ణ

Satyam NEWS

Leave a Comment