35.2 C
Hyderabad
April 27, 2024 14: 34 PM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ గూటికి చేరబోతున్న వివేకా కుమార్తె సునీత

#yssunita

ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సునీత కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇక ఉమ్మడి కడప జిల్లాలో జగన్ పార్టీ గెలవడం సాధ్యం కాదు. పులివెందులలో జగన్ ఓడిపోవడం కూడా ఖాయంగా కనిపిస్తున్నది. కడప పార్లమెంటుకు షర్మిల గానీ, సునీత గానీ పోటీ చేయాలనే డిమాండ్ ఉన్నది. ఇదే జరిగితే వై ఎస్ అవినాష్ రెడ్డి గెలవడం సాధ్యం కాదు.

Related posts

లాక్ డౌన్ పటిష్ట అమలుకు డ్రోన్ కెమెరాల వినియోగం

Satyam NEWS

యాక్సిడెంట్: శ్రీచైతన్య స్కూల్ బస్సు బోల్తా

Satyam NEWS

ప్రధాని మోడీపై నిప్పులు చెరగుతున్న పాకిస్తాన్ నేతలు

Satyam NEWS

Leave a Comment