34.7 C
Hyderabad
May 5, 2024 01: 07 AM
Slider విశాఖపట్నం

కుమార్తెలను చంపేసి తండ్రి ఆత్మహత్య..

#crime

తండ్రి, ఇద్దరు కుమార్తెలు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన విశాఖపట్నం కంచరపాలెం పరిధిలో చోటుచేసుకుంది. కుమార్తెలను తండ్రి హత్య చేసి, తర్వాత అతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భావిస్తున్నారు. కంచరపాలెంలోని పాత రామారావు ఆసుపత్రి సమీపంలో గల గంగన్న నగర్ లో పిల్లా దుర్గ ఆంజనేయ ప్రసాద్ (40), కుమార్తెలు బిందు మాధవి(14, భార్గవి(13)తో నివాసం ఉంటున్నారు. 2013లో ప్రసాద్ భార్య నాగమణి మృతి చెందింది.

దీంతో కుమార్తెలిద్దరితో ప్రసాద్ గంగన్న నగర్ లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం క్రితం ఆటో నడిపి కుటుంబాన్ని నెట్టుకు వచ్చిన ప్రసాద్, ఇటీవల ఖాళీగా ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు.  ఇది ఇలా ఉండగా గురువారం సాయంత్రం తల్లి పిల్లా అనసూయ, కుమారుడు ప్రసాద్ ఇంటికి చేరుకొని తలుపు కొట్టగా, తీయకపోవడంతో అతని సెల్ ఫోన్ కి కాల్ చేసింది.

ఫోన్ కాల్ కూడా ఎత్తకపోవడంతో స్థానికులకు విషయం చెప్పింది. దీంతో వారు 100కు డయల్ చేయగా, పోలీసులు ప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుమార్తెలిద్దరూ నేలపై చనిపోయి ఉండడాన్ని పోలీసులు గమనించారు. తండ్రి ప్రసాద్ ఫ్యాన్ హుక్కుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండడాన్ని గుర్తించారు. సంఘటన స్థలానికి ఏసిపి అన్నెపు నరసింహమూర్తి, సిఐ ఎస్ విజయకుమార్, ఎస్సై రవి కిషోర్ చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కుమార్తెలుద్దరిని చంపేసి ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులా, మరే కారణాలు ఉన్నాయా అని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్ మార్చురీకి తరలించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఐసోలేషన్: కరోనా దెబ్బకు అమరావతి ఆందోళన బంద్

Satyam NEWS

ప్రైవేట్ అధ్యాపకులను, నిరుద్యోగులను ఆదుకోవాలి

Satyam NEWS

అభివృద్ధికి ఐకాన్ ఖమ్మం

Murali Krishna

Leave a Comment