నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన కొల్లాపూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులు వంగ రాజశేఖర్ గౌడ్, కౌన్సిలర్ షేక్ రహీం పాషా, సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, మాజీ సర్పంచ్ ఎన్నన్ బెట్ల నాగరాజు, నాయకులు దిలీప్ సన్మానించారు.
నిన్న ప్రకటించిన ఫలితాల్లో వై. దివ్య సీఈసీలో (830/1000) ఎంపీసీ ఫస్టియర్ లో బి. లత (447/470) మార్కులు సాధించిన విషయం తెలిసిందే. అనంతరం యువ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతిని అందించి శుభాకాంక్షలు తెలిపారు.
నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకోని ప్రణాళిక బద్దంగా చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఉన్నతమైన కెరీర్ కోసం లక్ష్యాన్ని అలవర్చుకొని వాటి కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరెందర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ వినయ్ కుమార్, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.