సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో మండలgలోని వ్యవసాయ సాగు గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా MPP మూడావత్ పార్వతి కొండ నాయక్ మాట్లాడుతూ అధికారులు, రైతులకు అందు బాటులో ఉండాలని సూచించారు.
అదే విధంగా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు రైతులకు షార్టేజ్ లేకుండా చేయాలని కోరారు,మండలంలో మూడు కాస్టర్ లో 27000 ఎకరాల్లో పంటలు వేశారని తెలిపారు.
అందులో సుమారుగా వరి 19000, ఎకరాలలో, పత్తి 5000, మిర్చి 2000,నిమ్మ, జమ, మామిడి, బత్తాయి తోటలు 1000 ఎకరాలలో పంటలు వేశారని కనుక ఈ పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు.