YCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుభరోసా కేంద్రాలలో రైతు ఒనగూడేది ఏమిలేదని రైతుల వాపోయారు. అదేమైనా లబ్ది వస్తే YCP కార్యకర్తలే జేబులు నింపుకొంటున్నారని అన్నారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామం లోని రథశాల వద్ద జరిగిన రచ్చ బండ కార్యక్రమంలో ప్రజలతో మాజీమంత్రి ఆలపాటి రాజా పాల్గొని ప్రజా సమస్యలపై చర్చ జరిపారు.
తమ గ్రామంలో అభివృథ్థి లేదని, డ్వాక్రామహిళలలు తమకు వద్దన్నా డబ్బులిచ్చి అథికవడ్డీల వసూలు చేస్తున్నారన్నారు. ఓ మహిళ తనకు ఇప్పటి దాకా వస్తున్న పించన్ రద్దు చేశారని ఎందుకు రద్దు చేశారో అర్ధం కావటం లేదన్నారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రభుత్వానకి చరమ గీతం పాడే రోజు దగ్గరలో ఉందన్నారు. అనంతరం యువగళం గోడపత్రికను ఆవిష్కరించారు.