దీపావళి పండుగ రోజున షాట్ సర్క్యూట్ జరగడంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలో పూరి గుడిసే దగ్ధం అయింది. శనివారం మున్సిపల్ పట్టణ కేంద్రంలో 8వ వార్డులోని శ్రీ కృష్ణ వీధిలో సబ్ స్టేషన్ హై హోల్టేజ్ తో మంటలు రావడంతో 6,7,8,9 వార్డులలోని ఇండ్లలో మీటర్లు టీవీలు కాలిపోయాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరీ గుడిసె దగ్ధం అయింది. వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వెంటనే విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడారు.
జరిగిన నష్టానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తామని బాధితులకు తెలిపారు. అదే విధంగా మాజీమంత్రి జూపల్లి కృష్నారావు అనుచరులు స్థానిక కౌన్సిలర్స్ లక్ష్మి వేణు, నయిం, షేక్ రహీం పాషా తో పాటు మేకల నాగరాజు, కిరణ్ యాదవ్,కి షోర్ యాదవ్ వార్డులో సంఘటనకు సంబంధించిన అంశాలను తెలుసుకొని మాజీమంత్రి జూపల్లికి తెలియచేశారు.
రాత్రి వేళలో జరిగిన షాట్ సర్క్యూట్ అంశాన్ని తెలుసుకున్న టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు అభిలాష్ రావు రంగినేని నేరుగా వార్డులోని బాధితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటానాని భరోసానిచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆదివారం స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్ర శేఖర చారి షాట్ సర్క్యూట్ తో దగ్ధమైన గుడిసె బాధితురాలికి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి వ్యక్తగతంగా పంపిణీ చేసిన 20 వేలను అందచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జి. నరేందర్ రెడ్డి,కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.
కేబుల్ టివి ఆపరేటర్ రాఘవేంద్రకు భారీ నష్టం..
కొల్లాపూర్ పట్టణంలోని 6,7,8,9వార్డులోని కేబుల్ టీవీ ఆపరేట్ కు భారీ నష్టం వాటిలింది. సుమారు 50 వేల రూపాయల నష్టం జరగడంతో ఆవేదనకు గురయ్యాడు.
కేబుల్ టీవీకి సంబంధించిన ఫిల్టర్స్, నొడ్స్, అంపిల్ వైర్స్,సెటప్ బాక్స్ తదితర పరికరాలు పూర్తిగా దగ్ధం కావడంతో ఈ నష్టం వాటిలింది. ఈ అంశాన్ని ఎమ్మెల్యే దృష్టి కి కూడా తీసుకపోయ్యారు. తక్షణమే ప్రభ్యుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.