అమెరికాలో రోజురోజుకు కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా న్యూయార్క్లోని బ్రోంక్స్ స్ట్రీట్లో కాల్పుల సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు (యుఎస్ కాలమానం ప్రకారం) జరిగిన ఒక ఘర్షణలో 15 ఏళ్ల విద్యార్థిని కాల్చి చంపారు. ఈ సంఘటనకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల కోసం న్యూయార్క్ పోలీసులు గాలిస్తున్నారు. ఇలా కాల్పులు జరిపిన ఘటనలు అమెరికా పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈరోజుల్లో అమెరికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి.
సెప్టెంబరు ప్రారంభంలో, నార్త్ కరోలినాలోని ఒక ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. గత వారాంతంలో డెట్రాయిట్లో 19 ఏళ్ల యువకుడిపై కొందరు హత్యాకాండకు పాల్పడ్డారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన యాదృచ్ఛిక కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దేశంలో హింసాత్మకంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో ఆయుధాలను నిషేధించాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు.