గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిర్జదిగుడా కమిషనర్ ప్రతిపక్షాల పార్టీకి కనీసం ఆహ్వానం పంపకుండా టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టు 15న ఇదే విధంగా జరిగితే కమిషనర్ దృష్టికి తీసుకొస్తే మరల జరగదని చెప్పిన కమిషనర్ మళ్లీ తిరిగి అలానే ప్రతిపక్ష పార్టీలకు మళ్లీ ఆహ్వానం పంపకుండా చేస్తున్నారు.
ఒక బాధ్యత గల కమిషనర్ గా వ్యవహరించవలసిన కమిషనర్ అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు.ఇందుకు నిరసనగా ఈ రోజు పిర్జదిగుడా కమిషనర్ ఒంటెద్దు పోకడలకు నిరసనగా పీర్జాదిగూడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నమిలికొండ అనిల్ రెడ్డి, పిర్జదిగుడా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఇందుకు పిర్జాదిగూడ కమిషనర్ ఛాంబర్ లో నిరసన తెలుపడం జరిగింది