నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో కరోనా కలకలం చెలరేగింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతనితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న 19 మందిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు. అదే విధంగా పట్టణంలేని రెండు ఏరియాలను కంటైన్ మెంట్ జోన్లు గా అధికారులు ప్రకటించారు.
అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి టెస్టులు చేయగా కరోనా పాజిటీవ్ చవ్చింది. అతను ఒక లారీ డ్రైవర్ కాగా గత వారంరోజుల క్రితం లోబిపి రావడంతో హైదరాబాద్ లో చికిత్స కోసం వెళ్లాడు. లో బిపి తో బాటు జ్వరం తీవ్రంగా రావడంతో కరోనా టెస్టు నిర్వహించారు.
అందులో పాజిటివ్ రావడంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అతనికి పాజిటీవ్ వచ్చిన కారణంగా చౌనివిధి, రజక వీధి ని కంటైన్ మెంట్ జోన్ లుకా అధికారులు ప్రకటించారు. కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఏడవ వార్డులో కరోనా కేసు నమోదయినట్లు ప్రచారం జరుగుతుంది.
పట్టణంలోని ఏడో వాడు బాధితుని ఇంటికి సంబంధించిన ఒక గదిని క్లోజ్ చేశారు. ఆ వైపు ఈ వైపు దారులు మూసేశారు. ఇప్పటి వరకు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఒక్కటి కూడా కరోనా కేసు నమోదు కాలేదు. ఇదే మొదటి కేసు. అధికారులు ఎన్నో విధాలుగా సూచనలు చేస్తున్న కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకపైన కొల్లాపూర్ పట్టణం ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారుల సూచనలు ఫాలో అవుతే వైరస్ కు దూరంగా ఉండొచ్చు. మరి కొంత మందికి సోకకుండా కట్టడి చేయవద్చు.