రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలోకి ఇటీవల కొత్తగా చేర్చిన గౌలీ కుల మొదటి సర్టిఫికెట్ ను లక్ష్మీప్రియకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అందజేశారు.
గురువారం మంత్రుల అధికారిక నివాసంలో గౌలీ కుల ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీప్రియ మీ సేవా ద్వారా పొందిన గౌలీ కుల సర్టిఫికెట్ ను అందజేశారు.
పశువులను కాస్తూ పాలు అమ్మే కుల వృత్తి కావడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటూ గతంలో యాదవ్ గా కుల సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళమని గౌలీ కుల ప్రతినిధులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 కులాలను బీసీ జాబితాలోకి ఇటీవలే చేర్చడం వల్ల సొంత కుల సర్టిఫికెట్ పొందడం ద్వారా తమలో ఆత్మ గౌరవాన్ని నింపిన సీఎం కేసీఆర్ కు రుణ పడి ఉంటామని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో గౌలీ గూడ, గౌలీ దొడ్డి ప్రాంతాలు తమ కులం పేరుతో ఉన్నాయని గౌలీ కుల ప్రతినిధులు వివరించారు. గౌలీ కులస్తులకు వినోద్ కుమార్ ఈ సందర్భంగా అభినందించారు.