మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై కేంద్ర కారాగారం కేంద్రంగా సిబిఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులకు చెందిన నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, చంటి (హిజ్రా) మరో ఇద్దరు వ్యక్తులు సిబిఐ విచారణకు హాజరయ్యారు.
నిన్న ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకొని సిబిఐ అధికారులు విచారించారు. అదే విధంగా ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి ఫోన్ ను సీబీఐ బృందం స్వాధీనం చేసుకున్నది.
ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం కర్మాగారంలో ఉద్యోగి. ఇప్పటికే పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు.
లాంకర్ లోని 48 లక్షల నగదు, 20 తులాల బంగారు, 28 లక్షల ఎఫ్.డీ లు స్వాధీనం చేసుకున్నారు.