38.2 C
Hyderabad
May 3, 2024 20: 52 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ఆర్యవైశ్య మహిళ హత్య కేసులో 5గురు అరెస్టు

#wanaparthypolice

ఈనెల 7వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో ఒంటరిగా ఉంటున్న ఆర్యవైశ్య మహిళ అమరవాది వరలక్ష్మిని హత్య చేసిన కేసులో 5గురిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు విలేకరులకు తెలిపారు. నిందితులను విలేకరులకు చూపారు.

నిందితుల నుండి 1,52,300 నగదు, ఐదు సెల్ ఫోన్లు ఒక బైకు,బంగారు ఆభరణాలు కుదపెట్టిన రసీదులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు.కర్నూలు జిల్లా గూడూరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన చిన్ని తరుణ్ కుమార్(25),బేతంచర్ల మండలం నాకెళ్ల చాణక్య(34),వృత్తి కిరాణం దుకాణం, వనపర్తిలోని వల్లభనగర్ కు చెందిన శశికళ(52),ఆమె కుమారులు బాలకృష్ణ(26),సంతోష్ కుమార్(34)అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.

వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకిర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పీ ఆనందరెడ్డి,వనపర్తి సిఐ ప్రవీణ్ కుమార్, సీసీఎస్ సిఐ శ్రీనివాస్ చారి,వనపర్తి టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి,రెండో ఎస్ఐ శివకుమార్, రూరల్ ఎస్ఐ రామరాజు, వేణు, రిషికేశ్, అంజాద్, రాము,జయన్న కేసును ఛేదించారన్నారు.ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందించారు. వనపర్తి టౌన్, ఇతర ప్రాంతాల్లో ఇండ్ల ముందు సిసి కెమెరాలు ఏర్పాటు ఎస్పీ ప్రజలను కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఇంటర్ ఫలితాలపై సిబిఐ దర్యాప్తు???

Satyam NEWS

బహుజన మహిళలపై పెరిగిన అత్యాచారాలు

Satyam NEWS

కోట్పా చట్టంపై అవగాహన అవసరం

Sub Editor

Leave a Comment