సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మం పల్లి గ్రామం లో దారుణం జరిగింది. అత్తవారింటికి వచ్చిన అల్లుడే ఈ దారుణ ఘటనకు పాల్పడటం విషాదం. అల్లుడు లక్ష్మి రాజ్యం అత్తవారింటి వచ్చి అతని భార్య కూతురు బామ్మర్ది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్య విమల, కూతురు సునీత, బామ్మర్ది జాన్ రాజు, ఆయన భార్య రాజేశ్వరి, జాన్ పెద్దక్క సునీతకు తీవ్రగాయాలు అయ్యాయి. ముందుగా వీరిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన తర్వాత నిందితుడు పోలీసులకు లొంగి పోయినట్లు సమాచారం. నిందితుడు లక్ష్మి రాజ్యం గంగాధర మండలం మణికొండ గ్రామానికి చెందినవాడు. అత్తగారి కుటుంబంతో ఉన్న కలహాల కారణంగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాధమిక సమాచారం బట్టి తెలుస్తున్నది.