38.2 C
Hyderabad
May 5, 2024 22: 56 PM
Slider మెదక్

అత్తవారింటికి వచ్చి ఐదుగురికి నిప్పంటించిన అల్లుడు

sidipet fire

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మం పల్లి గ్రామం లో దారుణం జరిగింది. అత్తవారింటికి వచ్చిన అల్లుడే ఈ దారుణ ఘటనకు పాల్పడటం విషాదం. అల్లుడు లక్ష్మి రాజ్యం అత్తవారింటి వచ్చి అతని భార్య కూతురు బామ్మర్ది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్య విమల, కూతురు సునీత, బామ్మర్ది  జాన్ రాజు, ఆయన భార్య రాజేశ్వరి, జాన్ పెద్దక్క సునీతకు తీవ్రగాయాలు అయ్యాయి. ముందుగా వీరిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన తర్వాత నిందితుడు పోలీసులకు లొంగి పోయినట్లు సమాచారం. నిందితుడు లక్ష్మి  రాజ్యం గంగాధర మండలం మణికొండ గ్రామానికి చెందినవాడు. అత్తగారి కుటుంబంతో ఉన్న కలహాల కారణంగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాధమిక సమాచారం బట్టి తెలుస్తున్నది.

Related posts

ఇంటింటికీ జాతీయ జెండా కార్య‌క్ర‌మం ప్రారంభం…!

Satyam NEWS

అనాధ అమ్మాయిల ఆచూకీ లభ్యం…!

Satyam NEWS

అంకితభావంతో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

Satyam NEWS

Leave a Comment