38.2 C
Hyderabad
April 29, 2024 11: 16 AM
Slider కరీంనగర్

అంకితభావంతో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

#VemulawadaMunicipality

కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్న ఈ సమయం లో వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవీ రాజు అభినందించారు.

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించిన చైర్ పర్సన్ పారిశుద్ధ్య  సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి వారికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.

సిబ్బంది కూడా కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. అదే విధంగా డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ మాస్క్ ధరించి చేతులు శానిటైజ్ చేసుకోవాలని తెలిపారు.

పారిశుద్ధ్య  పనుల్లో నిమగ్నం అయి వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, మున్సిపాల్ జవాన్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

సాయంత్రం 6 తర్వాత కూడా మద్యం అమ్మేందుకు ప్లాన్ రెడీ

Satyam NEWS

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించండి

Satyam NEWS

హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న బర్మా దేశస్థుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment