టీఆర్ఎస్ పార్టీ రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు ఢిల్లీ వరకూ వెళ్లింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో పలువురు ఎంపిలు గ్రీన్ ఛాలెంజ్ కి ఆకర్షితులై మొక్కలు నాటుతున్నారు. ఢిల్లీలో పలువురు ఎంపీలు తమ నివాసాల్లో మొక్కలు నాటారు. NCP ఎంపీ వందనా చవాన్ గ్రీన్ ఛాలెంజ్ ని నేడు స్వీకరించారు. తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. అదే విధంగా DMK ఎంపీ తిరుచి శివ తన నివాసంలో మొక్కలు నాటి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి ప్రయత్నం అని వ్యాఖ్యానించారు. సహచర ఎంపీ సంతోష్ కుమార్ కృషికి వారు అభినందనలు తెలిపారు.
previous post