భీమిలి బీచ్ లో పట్టుకున్న ప్రత్యేక బృందాలు…!
విజయనగరం పోలీసులు… అందునా రూరల్ పోలీసులు… సంచలనమైన కేసు ను 24 గంటల వ్యవధిలో చేధించారు..అదీ పోలీసు బాస్ ఛాలెంజ్ గా తీసుకోవడంతో…ఇద్దరు అమ్మాయిల ఆచూకీ… ఒక్క రోజు వ్యవధిలోనే కనుగొన్నారు. విజయనగరం మహిళా ప్రాంగణంలో ఉన్న అనాధ ఆశ్రమం నుంచీ ఇద్దరు అమ్మాయిలు… ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి పరారయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ తిరుపతి రావు…ఎస్ఐ గణేష్ లు…కేసు నమోదు చేసారు. అమ్మాయిల పరారైన విషయం సీరియస్ గా తీసుకున్న ఎస్పీ దీపికా… స్పెషల్ టీంను దించారు.
ఈ మేరకు రూరల్ సీఐ ఆధ్వర్యంలో గణేష్… సీసీఎస్ ఎస్ఐ సాగర్ బాబు, డెంకాడ ఎస్ఐ లు సిబ్బంది… గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్ఫాన్ ఆశ్రమం అధికారి చెప్పిన మాటలు.. గదిలో పరిసరాలను పరిశీలించిన స్పెషల్ టీం…చెల్లూరు నుంచీ తగరపువలస…అక్కడ నుంచీ భీమిలి కి అమ్మాయిలు వెళ్లినట్లు తెలు సుకుని…భీమిలి వెళ్లి.. అమ్మాయిలను పట్టుకున్నారు.
ఈ మేరకు మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ అలాగే ఆనాధ ఆశ్రమం నిర్వాహకులను రూరల్ పీఎస్ కు తీసుకువచ్చి…అమ్మాయిలను అప్పగించే పనిలో రూరల్ పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇక వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణం సమీపంలో వై జంక్షన్ నుంచీ ఆ అమ్మాయిలను వేధించిన కుర్రాళ్లు పట్టుకునే వేటలో పడ్డారు…సీసీఎస్ ఎస్ఐ సాగర్ బాబు అతని బృందం. ఇక ఎస్పీ ఆదేశాలతో…మరికొద్ది గంటలలో కేసు తాలూక పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నట్లు సమాచారం.