రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో గత రాత్రి రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జలోరీ గేటు వద్ద ఉన్న జెండా పీకేసి మరో జెండాను పెట్టడంపై వివాదం మొదలైంది.
అనంతరం ఇరువైపులా రాళ్ల దాడి మొదలైంది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నేడు జరుపుకుంటున్న ఈద్, అక్షయ తృతీయ పండుగ ముందు రోజు రాత్రి జరిగిన ఈ రచ్చను నిరోధించడానికి నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
రాళ్లదాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. నగరంలో వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంది. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, సామరస్యాన్ని కాపాడుకోవాలని జోధ్పూర్ జిల్లా యంత్రాంగం ఇరువర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది.