నెల్లూరు నగరంలో మెడికవర్ (పాత సింహపురి) ఆసుపత్రి వద్ద హైవే పై ఫ్లైఓవర్ కోసం చాలా కాలం నుంచి కృషి చేస్తున్నానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తనను కలిసిన సిపిఎం నేత శ్రీనివాసులు, కార్యకర్తలకు తెలిపారు. నెల్లూరు పరిధిలో ఐదు ఫ్లైఓవర్ ల కోసం కృషి చేస్తే 3 మంజూరయ్యాయని, అందులో మెడికవర్ ఆసుపత్రి వద్ద ఫ్లై ఓవర్ కూడా ఒకటి అని తెలిపారు.
అయితే కొందరు అధికారులు అక్కడ ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉందనే కారణంతో, దానిని పెండింగ్లో పెట్టారని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. నవంబర్ లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని తాను వారి దృష్టికి తీసుకెళ్లి ఫ్లైఓవర్ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, పాముల హరిప్రసాద్, నరసింహారావు, మధు తదితరులు పాల్గొన్నారు.