తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల్ చౌరస్తా శివాజీ చౌక్ వద్ద కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాం చందర్, టౌన్ ప్రెసిడెంట్ మరుగొండ రాము, వైస్ చైర్మన్ సాజిద్, కౌన్సిలర్ లు, కోఆప్షన్ మెంబెర్స్ TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.