హనుమాన్ జయంతి సందర్భంగా అంబర్పేట్ డివిజన్ లోని ప్రేమ్ నగర్ లో ఆంజనేయ స్వామి మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పటేల్ నగర్ లో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు దేవస్థాన కమిటీ నిర్వాహకులు పలు పార్టీల నాయకులు, ప్రేమ్ నగర్ ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, ఆచార్య ఆత్రేయ, శివాలయ అర్చకులు సంతోష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు మల్లేశం గుప్తా, బాల్ రెడ్డి, రమేష్, ధన్ రెడ్డి, చంద్రగిరి యాదగిరి, భాస్కర్ రెడ్డి, తిరుపతి గుప్తా, ప్రేమ్ దాస్, లింగయ్య, పటేల్ నగర్ దేవస్తాన కమిటీ సభ్యులు ఆమనూరి సతీష్ బాబ్లీ, పత్తి అనిల్ కుమార్, జాకీ బాబు, రసమల అనిల్, తిరుపతి, విష్ణు, అజ్జు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట