పెద్ద దూరం కూడా కాదు. తల్లి ఉండేది కృష్ణా జిల్లా కంచికచర్లలో కుమార్తె ఉండేది గుంటూరు అగ్రహారం ప్రాంతంలో. 80 ఏళ్ల వృద్ధురాలు అయిన తల్లి చనిపోయినా కుమార్తె రాలేక పోయింది. కారణం లాక్ డౌన్. కృష్ణా జిల్లా కంచికచర్ల కు చెందిన రామ తులశమ్మ(80) నిన్న సాయంత్రం అనారోగ్యం తో మృతి చెందారు. ఈ విషయం తెలిపి కన్న తల్లి శవాన్ని చివరి సారిగా చూడడానికి గుంటూరు పోలీసులను, అధికారుల ను అభ్యర్థించినా వారు కనికరించలేదు. వేలాది మంది పని లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. కానీ అవసరమైన వారిని మాత్రం పోలీసులు వదలడం లేదు. చివరకు ఆమె కుమార్తె తల్లి భౌతిక కాయాన్ని వీడియో కాల్ లో నే చూసుకుంది.
previous post