మూడేళ్ళ తర్వాత విజయనగరం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు విభాగాలలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించదలిచామని వీసీఏ ప్రతినిధులు ఎం.ఎల్.ఎన్.రాజు ,రాంబాబు లు చెప్పారు. ఈ మేరకు విజయనగరం సర్ విజ్జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడు కేటగిరీలైన అండర్ -14, అండర్-19, అండర్-21, అండర్-25 లకు టోర్నమెంట్ లలో విజేతలకు ఇదే విజ్జీ స్టేడియంలో బహుమతులు ఇవ్వబడుతుందని చెప్పారు. గడచిన మూడేళ్ళ గా వీసీఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరగలేదని…ఇటీవలే పోటీలు నిర్వహించదలిచామని..వీసీఏ కార్యదర్శి రాజు చెప్పారు.
previous post