39.2 C
Hyderabad
May 3, 2024 11: 21 AM
Slider జాతీయం

ఫుడ్ పాయిజనింగ్ తో ఛోటా రాజన్ హత్యకు కుట్ర

chota rajan

దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డి కంపెనీ అండర్ వరల్డ్ క్రిమినల్ చోటా రాజన్‌ను హత్య చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. తాజాగా ఛోటా రాజన్ ను ఉంచిన తీహార్ జైలులో అతనిపై విషప్రయోగం జరిగింది. దాంతో అధికారులు ఛోటా రాజన్ కు భద్రత పెంచారు. అతనికి ఇచ్చే ఆహారాన్ని ముందుగా పరీక్షించి మరీ ఇస్తున్నారు. అతనికి భద్రతను మరింత కఠినతరం చేశారు.

అండర్ వరల్డ్ క్రిమినల్ అయిన చోటా రాజన్ ను ఇప్పుడు సూపర్ సెక్యూరిటీ జైలుకు తరలించారు. అతన్ని చంపడానికి విషప్రయోగం చేస్తున్నట్లు ఎవరో అగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ప్రమాదం నుంచి ఛోటా రాజన్ ను పోలీసులు తప్పించగలిగారు. ఛోటా రాజన్ కు భద్రత మరింత పెంచినట్లు జైళ్ల విభాగం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ధృవీకరించారు. రాజన్ పై డి గ్యాంగ్ ఎందుకు పగపట్టిందో పోలీసులకు కచ్చితంగా తెలియడం లేదు.

Related posts

న్యూ ట్రెండ్:రామాయణ కథాంశం ఆధారంగా కొత్త రైలు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లా లో వ‌రి, మొక్క‌జొన్న ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు

Satyam NEWS

“బ్యాక్ డోర్” విడుదల వాయిదా! డిసెంబర్ 18 న ప్రేక్షకుల ముందుకు!!

Satyam NEWS

Leave a Comment