దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డి కంపెనీ అండర్ వరల్డ్ క్రిమినల్ చోటా రాజన్ను హత్య చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. తాజాగా ఛోటా రాజన్ ను ఉంచిన తీహార్ జైలులో అతనిపై విషప్రయోగం జరిగింది. దాంతో అధికారులు ఛోటా రాజన్ కు భద్రత పెంచారు. అతనికి ఇచ్చే ఆహారాన్ని ముందుగా పరీక్షించి మరీ ఇస్తున్నారు. అతనికి భద్రతను మరింత కఠినతరం చేశారు.
అండర్ వరల్డ్ క్రిమినల్ అయిన చోటా రాజన్ ను ఇప్పుడు సూపర్ సెక్యూరిటీ జైలుకు తరలించారు. అతన్ని చంపడానికి విషప్రయోగం చేస్తున్నట్లు ఎవరో అగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ప్రమాదం నుంచి ఛోటా రాజన్ ను పోలీసులు తప్పించగలిగారు. ఛోటా రాజన్ కు భద్రత మరింత పెంచినట్లు జైళ్ల విభాగం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ధృవీకరించారు. రాజన్ పై డి గ్యాంగ్ ఎందుకు పగపట్టిందో పోలీసులకు కచ్చితంగా తెలియడం లేదు.