విజయనగరం జిల్లాలో మరో దారుణం జరిగింది. జిల్లా లోని పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం లో ఫుడ్ పాయిజన్ జరిగింది. పర్వసనంగా…గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. అగ్రహారం లో ఓ వివాహ విందు లో ఫుడ్ పాయిజన్ అంశం కలకలం రేగింది.సమాచారం అందుకున్న కలెక్టర్ నాగలక్ష్మి.. స్థానిక పీహెచ్సీ అధికారులను అప్రమత్తం చేసారు. అలాగే జిల్లా సర్వజన హాస్పిటల్ డాక్టర్ తో సంప్రదింపులు జరిపారు హుటాహుటిన హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్ అప్పలనాయుడు.. హుటాహుటిన.. సమావేశం నిర్వహించి…అస్వస్థతకు గురైన వారికి అత్యవసరం గా వైద్య సేవలు అందించే పనిలో ఉన్నారు. ఇక కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఫుడ్ పాయిజన్ జరిగిన కొవ్వాడ అగ్రహారంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తున్న జిల్లా పంచాయితీ అధికారి శ్రీధర్ రాజు, ప్రత్యేక పారిశుద్ధ్య పనుల నిమిత్తం తగినంత గా బ్లీచింగ్ నిల్వలు గ్రామంలో వేయించి పారిశుద్ధ్య పనులు చేయించారు. అసలు వివాహ విందు లో ఫుడ్ పాయిజన్ జరగడంపై…ఆరా తీస్తున్నారు… అధికారులు