అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిధిలో పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఏ.నవ్య కు జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి ప్రశంసా పత్రం అందచేశారు. ఏ.నవ్య బుక్కరాయ సముద్రం బీసీ సంక్షేమ హాస్టల్ లో ఉంటూ బుక్కరాయ సముద్రం జెడ్పీ హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసింది. నవ్యతో కలిపి బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతూ 500కి పైగా మార్కులు సాధించిన 22 మందికి జిల్లా కలెక్టర్ ప్రశంశా పత్రాలు అందజేశారు. అందరూ బాగా చదవుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్తులో మంచి స్థాయిల్లో స్థిరపడేందుకు సహకరించాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖుష్బూ కొఠారిని ఆదేశించారు.
previous post