భోజన ప్రియుల కు నాణ్యమైన ఆహారాన్ని అందించి వారి మన్ననలను పొందాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ డివిజన్ లోని హెచ్ఎండిఎ లేఅవుట్ ఉప్పల్ భగాయత్ లో ఎస్సార్ ఫుడ్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిదులుగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి , కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్, కేటీఆర్ సేవాసమితి అధ్యక్షుడు ముజీబ్ భాయ్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భోజన ప్రియుల కు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడు శ్రావణ్ కుమార్ కు తెలిపారు. ఈ ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మా యొక్క ఫుడ్ కోర్ట్ లో నాణ్యమైన, మన్నికైన, రుచికరమైన వంటలు, ఆహార పదార్థాలు సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో టీం బిఎస్సార్ వ్యవస్థాపక అధ్యక్షుడు భేతీ సుమంత్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్ , గరిక సుధాకర్, బన్నల ప్రవీణ్ ముదిరాజ్ ,గంగిడి కృష్ణారెడ్డి, చింతల నరసింహారెడ్డి, పంగ మహేందర్ రెడ్డి, గొరిగె ఐలేష్, సల్ల సందీప్ రెడ్డి , కంకణాల శ్రీకాంత్ రెడ్డి, ఎం .డి రెహమాన్, వి. భి. నరసింహ, శ్రీ నువాస్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి