తెలంగాణ నుండి అన్నదమ్ములుగా విడిపోయిన ఏపీ రాష్ట్రంలో నేడు సంక్షోభం నెలకొందని, కేవలం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి లాభం చేకూర్చేందుకే కొందరు గందరగోళ పరిస్థితులు సృష్టించారని మల్కాజ్గిరి ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో ఓవైపు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తుండగా, మరోవైపు మూడు రాజధానుల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్ననేపథ్యంలో అయన ఏపీ పరిస్థితులపై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని ఓ తెలంగాణ వ్యక్తిగా ఈ పరిణామం తనకు ఎంతో సంతోషం కలిగించినప్పటికీ , ఏపీ పరిస్థితి చూస్తుంటే ఓ భారత పౌరుడిగా ఎంతో బాధగా ఉందని అన్నారు.
ప్రస్తుతం ఏపీ పరిస్థితి బాగాలేవని అన్నారు. ఏపీలో అభివృద్ధి తిరోగమనం వల్ల తెలంగాణ లాభపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు