ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ కూరగాయల మార్కెట్ నుంచి వెలువడుతున్న చెత్తను రోజు వారిగా తొలగించక పోవడం మూలంగా కంపు వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వ్యాపారులు కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ నుంచి వెలువడుతున్న చెత్తను రెండు రోజులకు మూడు రోజులకోసారి తొలగించడం మూలంగా గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త కుప్పల నుంచి వెలువడుతున్న దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.
కాప్రా సర్కిల్, పారిశుద్ధ్య విభాగం అధికారులు కుషాయిగూడ మార్కెట్ చెత్త విషయమై దృష్టి సారించి ఎప్పటి చెత్తను అప్పుడే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ అరుంధతి కాలనీ వాసులు, వ్యాపారులు కొనుగోలు దారులు చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ వేదికగా కోరుతున్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి