గోల్నాక డివిజన్ లో రూ.4 లక్షల వ్యయంతో వేయబోతున్న ఎంఎం డైయ మంచినీటి పైపులైన్ పనులను అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, సుధాకర్, వాటర్ మేనేజర్ షాకీర్, జిహెచ్ఎంసి అధికారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్కె బాబు, నర్సింగ్ యాదవ్, భరత్, ప్రకాష్ రెడ్డి, కాశీ నరేష్ , కాలేరు రాము, కాలేరు రాజు, యూసుఫ్, అంబటి రవి, సాయాద్ అలీ, లక్ష్మీనారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఈ పైప్ లైన్ గోల్నాక డివిజన్, ఆలీ దర్గా లైన్, అడ్డికార్కాన రోడ్డులో వేస్తారు. దీనివల్ల చాలా ప్రాంతాల తాగునీటి సమస్య తీరుతుందని అంటున్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్