సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామ సర్పంచ్ సలీమ రంజాన్ ఆధ్వర్యంలో ప్రముఖ డప్పు కళాకారుడు సతీష్ ని శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సలీమ రంజాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన కళాకారుల ప్రదర్శన అందరిని ఆకట్టుకున్న విషయం విదితమేనని,ఆ ప్రదర్శన హుజూర్ నగర్ నియోజకవర్గం లోని అప్పన్నపేట గ్రామ వాసి అమరారపు సతీష్ బృందానికి గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా గర్వించ దగిన విషయమని అన్నారు.గ్రామీణ స్థాయి కళాకారులను గుర్తించి సన్మానించడం అదృష్టమని అన్నారు. పేద కుటుంబానికి చెందిన సతీష్ డప్పునే నమ్ముకొని అతని బృందానికి కూడా ఉపాధి కల్పించడం చాలా గొప్ప విషయమని,సతీష్ ఇంకా మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నామని,మట్టిలో మణిక్యాలను వెలికితీయడమే లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య,రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం,షేక్ అలీ,గండు సైదులు, వేముల సైదులు,గంధసిరి మిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్