29.7 C
Hyderabad
May 3, 2024 03: 56 AM
Slider శ్రీకాకుళం

నేడు డీఈవో కార్యాల‌య ముట్ట‌డి

Srikakulam

ప్రభుత్వ ఉన్నత పాఠశాల శ్రీకాకుళం ఫ్యాప్టో శ్రీకాకుళం జిల్లా శాఖ అత్యవసర సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు నిర్వ‌హించారు. ఈ సమావేశంలో డీఈఓ కార్యాలయ ముట్టడి గురించి సభ్య సంఘాల ప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా ఈ పికెటింగ్ రెండు డిమాండ్ మీద జరుగుతుందని ఫ్యాప్టో ప్రతినిధులు తెలియజేశారు. ఉపాధ్యాయుల బదిలీలలో ఖాళీలు అన్నిచూపించాలని, అంతేకాకుండా ఉపాధ్యాయులకు మాన్యువల్గా బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఫ్యాప్టో డీఈఓ కార్యాలయ ముట్టడి నిర్ణయం తీసుకుందని వివరించారు.

ఈ కీలక సమావేశంలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు పెడాడ ప్రభాకర్ రావు, సెక్రెటరీ జనరల్ ప్రతినిధులుగా ఏపిటిఎఫ్ నుండి చావలి శ్రీనివాస్, దాసరి రామ్మోహన రావు పాల్గొన్నారు. బి టి ఏ నుండి ఏ చెంచు, ప్రధానోపాధ్యాయులు సంఘ ప్రధాన కార్యదర్శి దాలినాయుడు, యుటిఎఫ్ నుంచి పొందూరు అప్పారావు, డి టి ఎఫ్ నుంచి అప్పల రాజు, ఏపిటిఎఫ్ 1938 నుండి టెంక చలపతి రావు, ఆప్టా నుంచి రామారావు మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అండ‌గా కాల్ సెంట‌ర్‌

Satyam NEWS

హై కోర్ట్ కాలనీ టు హెచ్ఎంటి నగర్ లింక్ రోడ్డును పునః ప్రారంభించాలని కేటీఆర్ కి వినతి

Satyam NEWS

కరోనా డ్యూటీ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment