28.7 C
Hyderabad
April 28, 2024 09: 16 AM
Slider ఆదిలాబాద్

ఆలయానికి, సంఘ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి

indrakaran

నిర్మల్ పట్టణంలోని వార్డు నంబర్ 8 కురన్నపేట్ లో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి,రూ.10 లక్షలతో నిర్మించనున్న కురన్నపేట్ గంగపుత్ర సంఘ భవనానికి బుధవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాకే దేవాలయలకు మహర్దశ వచ్చిందని ఒక్క నిర్మల్ జిల్లాలోనే ఇప్పటివరకు 400 మందిరాలను నిర్మించుకున్నామన్నారు.

నిర్మల్ నియోజకవర్గంలో 67 కుల సంఘాల వారికి సంఘ భవనాలు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము,స్థానిక కౌన్సిలర్ నల్లూరి పోశెట్టి, నాయకులు మురళీధర్ రెడ్డి,ముడుసు సత్యనారాయణ,సోమేశ్, గంగపుత్ర సంఘ సభ్యులు యువరాజ్, గోనుగొప్పుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

మూడు రాజధానులు ఓకే ముగ్గురు సిఎం లు కావాలి

Satyam NEWS

థాంక్స్: బిసి, ఎంబిసిలకు అధికారంలో వాటా ఇచ్చారు

Satyam NEWS

అక్టోబ‌రు 11 నుండి 15 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

Satyam NEWS

Leave a Comment