నిర్మల్ పట్టణంలోని వార్డు నంబర్ 8 కురన్నపేట్ లో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి,రూ.10 లక్షలతో నిర్మించనున్న కురన్నపేట్ గంగపుత్ర సంఘ భవనానికి బుధవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాకే దేవాలయలకు మహర్దశ వచ్చిందని ఒక్క నిర్మల్ జిల్లాలోనే ఇప్పటివరకు 400 మందిరాలను నిర్మించుకున్నామన్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో 67 కుల సంఘాల వారికి సంఘ భవనాలు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము,స్థానిక కౌన్సిలర్ నల్లూరి పోశెట్టి, నాయకులు మురళీధర్ రెడ్డి,ముడుసు సత్యనారాయణ,సోమేశ్, గంగపుత్ర సంఘ సభ్యులు యువరాజ్, గోనుగొప్పుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.