వై ఎస్ ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని టిటిడికి చెందిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఆదివారం అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. ముందుగా నూతన వంటశాలలో శ్రీరాముల వారు, శ్రీ లక్ష్మీదేవి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్న ప్రసాద ప్రసాద వితరణ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
previous post