అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు 27వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు బాగ్ అంబర్ పేట డివిజన్ లోని మల్లిఖార్జున్ నగర్ శివాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, తోటి అయ్యప్ప స్వాములతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట