మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని అంబర్ పేట నియోజకవర్గం అలి కేఫ్ రోడ్లో గల మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలలో విద్య ద్వారా చైతన్యం తెచ్చిన మహాత్ముడని వారి ఆశలతో యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ యాదవ్ యువసేన నాయకులు కుంకుమ నరేందర్, తూర్పు రామచంద్ర ముదిరాజ్, సునీల్ యాదవ్, రాము యాదవ్, గణేష్ ముదిరాజ్, సోను బాయ్, మాజర్ఆలీ, జగన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట