పెంచిన పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ కడప కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. గ్యాస్ సిలెండర్లకు పూలదండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక బిజెపి ధరలు పెంచుకుంటూ పోతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.బిజెపి, ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాస్, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి, ఎన్. ఎస్.యూ.ఐ రాష్ట్ర కార్యదర్శి బొజ్జా తిరుమలేష్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
previous post