28.7 C
Hyderabad
April 28, 2024 09: 13 AM
Slider కడప

పెరిగిన పెట్రో ధరల పై కడప కాంగ్రెస్ వినూత్న నిరసన

పెంచిన పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ కడప కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. గ్యాస్ సిలెండర్లకు పూలదండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక బిజెపి ధరలు పెంచుకుంటూ పోతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.బిజెపి, ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాస్, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి, ఎన్. ఎస్.యూ.ఐ రాష్ట్ర కార్యదర్శి బొజ్జా తిరుమలేష్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Related posts

కొత్త పే స్కేల్ తోనే ఏపి ఉద్యోగులకు వేతనాలు

Satyam NEWS

వైసీపీ పాలనా వైఫల్యాలపై చర్చకు వస్తావా నానీ?

Satyam NEWS

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

Satyam NEWS

Leave a Comment