హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా మౌలాలి ఏరియాలో ఫ్రెష్ లైవ్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయటం అభినందనీయమని కార్పొరేటర్లు జర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డిలు అన్నారు. శనివారం మౌలాలి కృష్ణా నగర్ స్ట్రీట్ నెంబర్ 4 లో ఏర్పాటుచేసిన ఫ్రెష్ లైవ్ ఫిష్ మార్కెట్ బన్సీలాల్ యాజమాన్యంతో లోయల్ అగ్రి ఫామ్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హాజరై ఫిష్ మార్కెట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ హైదరాబాదులోని అన్ని ప్రాంతాల వారిని అందుబాటులో ఉండేలా మౌలాలి కృష్ణా నగర్ స్ట్రీట్ నెంబర్ 4 లో ఏర్పాటు చేసిన మార్కెట్ యజమాని బన్సీలాల్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌలాలి మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే నాయకులు టీ. మల్కయ్య, ప్రముఖ వ్యాపారవేత్తలు వి ఎస్ ఎన్ రెడ్డి, కానాల సీతారామిరెడ్డి, బొద్దుల సునీల్, కే రాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్.నెట్, మేడ్చల్ జిల్లా ప్రతినిధి