సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం లోని నేరేడు చర్ల లో హుజూర్ నగర్ మిర్యాల గూడ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. నేరేడుచర్ల శివారులోని ఎన్టీఆర్ కాలనీ వద్ద మిర్యాలగూడ కోదాడ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది నేరేడ్చర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి సత్యనారాయణ అతని కుమారుడు జశ్వంత్ మరియు కూతురు కావేరితో కలిసి మోటార్ సైకిల్ పై నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో సత్యనారాయణ అతని కుమారుడు జశ్వంత్ అక్కడికక్కడే మృతిచెందగా కూతురు కావేరికి సీరియస్గా ఉండటంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
next post