ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన సోమల్ల సాంబయ్య అకాల మరణం చెందడం తీరని లోటని RT జూనియర్ కళాశాల ములుగు మిత్రబృందం అన్నారు. సోమవారం దశదిన కర్మకు మిత్రులు హాజరై నివాళులర్పించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి రూ.14000 ఆర్థిక సాయం అందించి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. మిత్రబృందంలో RT కళాశాల మిత్రులు నల్లబెల్లి సాంబయ్య పటేల్, ఎండి సిరాజ్, సాని కొమ్ము శ్రీనివాస్ రెడ్డి, రేగులపాటి అశోక్ రావు,లింగస్వామి, వసంతరావు, కరణ్ సింగ్, ఈర్షద్ అహ్మద్, రామ్ గౌడ్ ,స్థానికొమ్ము శ్రీకాంత్ రెడ్డి ,ఎండి అల్లిపాషా లు ఆర్థిక సాయం అందించారు. మానవత దృక్పథంతో సాయం అందించిన వారికి RT కళాశాల మిత్రబృందం, సోమల్ల సాంబయ్య కుటుంబం ,బంధుమిత్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం ఎల్లవేళలా అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు. కాగా మృతుని కి భార్య ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు.
previous post