కడప జిల్లా రాయచోటి పట్టణంలోని వైయస్సార్ విగ్రహానికి జూనియర్,డిగ్రీ ఒప్పంద అధ్యాపకులు వినతి పత్రం సమర్పించారు.
ఒప్పంద అధ్యాపకులకు రెన్యూవల్ ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్ల తమకు సకాలంలో వేతనాలు లేక తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారన్నారు.
కరోనా మహమ్మరి విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి తమ సమస్యలను చెప్పే అవకాశం లేనందున పట్టణంలోని బస్టాండ్ సర్కిల్ లోని వైయస్సార్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించామని వారు చెప్పారు.